ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్తో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 17 బంతుల్లో 52 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. అతని ప్రతిభకు ముగ్ధులైన ఐస్లాండ్ క్రికెట్ బోర్డు, 'టీమిండియా సెలెక్ట్ చేయకపోతే ఐస్లాండ్ తరఫున ఆడేందుకు అర్హత సాధిస్తాడు' అని సరదాగా ట్వీట్ చేసింది. ఐపీఎల్ 2025 వేలంలో రూ.1.10 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేయడంతో వైభవ్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన మిలియనీర్గా రికార్డు సృష్టించాడు.