ఆఫ్ఘన్ లో పడవ మునిగి 20 మంది మృతి

ఆఫ్ఘనిస్తాన్‌లో నదిని దాటుతుండగా పడవ మునిగిపోవడంతో 20 మంది మృతి చెందారు. మొమండ్ దారా జిల్లాలో నది దాటుతుండగా పడవ మునిగిపోవడంతో మహిళలు, చిన్నారులు సహా 20 మంది మరణించారని నంగర్‌హర్ ప్రావిన్స్‌లోని సమాచార మరియు సాంస్కృతిక శాఖ ప్రాంతీయ డైరెక్టర్ ఖురైషీ తెలిపారు. గ్రామస్తుల ప్రకారం, పడవలో 25 మంది ప్రయాణిస్తున్నారని, వారిలో ఐదుగురు ప్రాణాలతో బయటపడ్డారని ఖురైషీ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్