TG: హైదరాబాద్ కేంద్రంగా 200 అమెరికా కంపెనీలు పనిచేస్తున్నాయని సీఎం రేవంత్రెడ్డి వెల్లడించారు. అమెరికాకు స్వాతంత్య్రం వచ్చాక ప్రపంచం పూర్తిగా మారిందని సీఎం అన్నారు. అమెరికాతో తెలుగు ప్రజలకు స్నేహపూర్వక బంధం ఎంతో బలమైందన్నారు. శుక్రవారం హైదరాబాద్లోని హోటల్ తాజ్కృష్ణలో US స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సీఎం మాట్లాడుతూ.. 2047 నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు అమెరికన్ల మద్దతు కావాలని కోరారు.