క్రికెట్ చరిత్రలో 2025 రిటైర్మెంట్ ఇయర్గా మారనుందని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ ఏడాది రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. గడిచిన ఆరు నెలల్లో 15 మంది క్రికెటర్లు వీడ్కోలు పలికారు. ముఖ్యంగా విరాట్, రోహిత్ టెస్టులకు, టీ20లకు వీడ్కోలు పలుకగా.. మ్యాక్సీ, స్మిత్, స్టోయినిస్ వన్డేలకు రిటైర్మెంట్ ఇచ్చారు. క్లాసెన్, పూరన్ అన్నీ ఫార్మాట్లకు గుడ్ బై చెప్పారు.