ఆపరేషన్ కగార్లో భాగంగా మావోయిస్టుల ఎన్కౌంటర్లు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. తాజాగా ఛత్తీస్గఢ్ నారాయణపుర్ జిల్లా ఎస్పీ ఎదుట 22 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో ఎనిమిది మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు. లొంగిపోయిన వారిపై రూ.37 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ముఖ్యంగా వారిలో కుతుల్ ఏరియా కమిటీ కమాండర్ సుక్లాల్ ఉన్నారు.