మధ్యప్రదేశ్ ఇండోర్లో బుధవారం రాత్రి షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. నందలాల్పురా ప్రాంతంలోని కిన్నర్ డేరాలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ కారణంగా 25 మంది ట్రాన్స్జెండర్లు ఫెనైల్ తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. స్థానికులు వెంటనే వారిని మహారాజా యశ్వంత్రావు హాస్పిటల్కు తరలించగా, అందరి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వివాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.