పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో 28,740 ఉద్యోగాలు

దేశ వ్యాప్తంగా పోస్టల్ సర్కిళ్లలో 28,740 గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఉద్యోగాల భర్తీకి ఇండియా పోస్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతిలో గణితం, ఇంగ్లిష్, స్థానిక భాష సబ్జెక్టులతో ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ పరిజ్ఞానం, సైకిల్/బైక్ నడపడం తెలిసి ఉండాలి. వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. ఫిబ్రవరి 14, 2026 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. జనరల్ అభ్యర్థులకు రూ.100 ఫీజు. ఎంపిక పదో తరగతి మార్కుల ఆధారంగా జరుగుతుంది. జీతం రూ.10,000 నుండి రూ.29,380 వరకు ఉంటుంది.

సంబంధిత పోస్ట్