ముంబైలో ఎమిరేట్స్ విమానం ఢీకొనడంతో 36 ఫ్లెమింగోలు సోమవారం చనిపోయాయి. నగరంలోని ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ఎమిరేట్స్ విమానం ల్యాండ్ అయ్యే ముందు ఫ్లెమింగో పక్షుల గుంపును ఢీకొట్టింది. దీంతో భారీగా ఫ్లెమింగోలు మృతి చెందాయి. స్థానికుల సమాచారంతో అటవీశాఖ అధికారులకు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చనిపోయిన ఫ్లెమింగో పక్షులను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై విమానయాన సంస్థ ఇంకా స్పందించలేదు.