ఉత్తరప్రదేశ్ హమీర్పూర్ జిల్లాలో వివాహ వేడుకలో గందరగోళం నెలకొంది. యూపీ ప్రభుత్వం 380 జంటల పెళ్లికి ఏర్పాట్లు చేసింది. అయితే అతిథుల కోసం ప్రభుత్వ భవనాల్లో ఏర్పాటు చేసిన చిప్స్ ప్యాకెట్ల కోసం జనం ఎగబడ్డారు. ఒకరిని ఒకరు తోసుకుంటూ చిప్స్ ప్యాకెట్స్ లాక్కున్నారు. ఈ ఘటనలో అదృష్టవశాత్తు ఎవరికీ ఎటువంటి గాయాలేదు. కాగా, దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.