మయన్మార్లో శుక్రవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 4.5 తీవ్రతగా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. వివరాల్లోకి వెళితే, శుక్రవారం ఉదయం 10.40 గంటల సమయంలో భూకంపం వచ్చిందని ఎన్సీఎస్ పేర్కొంది. భూకంప కేంద్ర బిందువు వెడల్పు 24.78, పొడవు 94.85, లోతు 85 కిలోమీటర్లుగా పేర్కొంది. ఈ ఘటనపై ఎన్సీఎస్ ఎక్స్ ఖాతాలో వివరాలను షేర్ చేసింది. ఇప్పటివరకు ఎలాంటి నష్టం జరిగినట్లు సమాచారం లేదు.