రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ, చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ను చీల్చి చెండాడాడు. కేవలం 17 బంతుల్లో 52 పరుగులు చేసి, అందులో 15 బంతుల్లోనే అర్ధశతకాన్ని పూర్తి చేసి ఐపీఎల్ రికార్డులను సమం చేశాడు. అతని నిర్భయమైన బ్యాటింగ్, అద్భుతమైన అవగాహనను విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. పాకిస్థాన్ మాజీ ఆటగాళ్లు కమ్రాన్ అక్మల్, బాసిత్ అలీలు వైభవ్ను భారత టీ20 జట్టులోకి తీసుకోవాలని సూచించారు.