మహారాష్ట్రలోని వాషిం జిల్లా మంగ్రుల్పీర్ తాలూకా కవ్తాల్ గ్రామ ప్రధాన మార్కెట్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడేళ్ల చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ప్రమాదానికి సంబంధించిన భయంకరమైన సిసిటివి (CCTV) దృశ్యాలు ప్రస్తుతం వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపగా, సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.