AP: శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండలం సోమందేపల్లిలో గంజాయి బ్యాచ్ హల్చల్ చేశారు. మంగళవారం సాయంత్రం ఇద్దరు యువకులపై దాడికి దిగారు. నడిరోడ్డుపై దారుణంగా కొట్టారు. బహిరంగ ప్రదేశాల్లో మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించారు. దాంతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న గంజాయి బ్యాచ్పై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.