ఆస్ట్రేలియాలోని పెర్త్లో జోవాన్ అపెల్బీ తన ముగ్గురు పిల్లలతో సముద్రంలో విహారానికి వెళ్లగా, వాతావరణం మారడంతో వారు తీరానికి దూరంగా కొట్టుకుపోయారు. 13 ఏళ్ల ఆస్టిన్ అనే బాలుడు దాదాపు 4 గంటల్లో 4 కిలోమీటర్లు ఈది తీరానికి చేరుకుని అధికారులకు సమాచారం అందించాడు. అతని సమాచారంతో అధికారులు హెలికాప్టర్ ద్వారా తల్లి, మరో ఇద్దరు పిల్లలను 14 కిలోమీటర్ల దూరంలో పెడల్ బోర్డులను పట్టుకుని వేలాడుతుండగా సురక్షితంగా కాపాడారు. బాలుడి ధైర్యసాహసాలను అధికారులు ప్రశంసించారు.