తమిళనాడులోని ఈరోడ్ కోపిచెట్టిపాళయం సమీపంలోని ఆలయ ఉత్సవాల్లో మేకను కోసి దాని రక్తం తాగిన పూజారి స్పృహతప్పి పడి చనిపోయాడు. నల్లకౌండన్పాళ్యం బాలాజీ నగర్కు చెందిన పళనిస్వామి (45)తో పాటు 5 మందికి పైగా పూజారులు పారణ కితై పూజలో అరటిపండ్లు రక్తంలో కలిపి తిన్నారు. దీంతో వాంతులు చేసుకుని, స్పృహతప్పి పడిపోయాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.