రాజస్థాన్లోని సవాయ్ మాధోపూర్ జిల్లాలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వేపై బనాస్ నది వంతెన సమీపంలో కారును గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు చనిపోయారు. మరో ఇద్దరు గాయపడినట్లు పోీలసులు వెల్లడించారు. సవాయ్ మాధోపూర్లోని గణేష్ ఆలయంలో ప్రార్థనలు చేసేందుకు వారంతా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.