ఒడిశాలోని టిట్లాగఢ్ లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. చిప్స్ ప్యాకెట్లోని బొమ్మ పేలడంతో ఓ చిన్నారి కంటి చూపు కోల్పోయాడు. ఎనిమిదేళ్ల అంకేశ్ చిప్స్ ప్యాకెట్లో వచ్చిన బొమ్మతో ఆడుకుంటూ వంటింట్లోకి వెళ్లాడు. ఈ క్రమంలో ఆ బొమ్మ స్టవ్ పై పడి పేలిపోయింది. దీంతో అతడి కంటికి తీవ్ర గాయమై చూపు కోల్పోయాడు. గతనెలలో కంధమల్(D)లో చిప్స్ ప్యాకెట్లోని టాయ్ మింగి 4 ఏళ్ల చిన్నారి చనిపోయాడు. ఇలాంటి టాయ్స్ విషయంలో పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.