భర్తకు దగ్గరుండి మరో యువతితో పెళ్లి చేసింది ఓ భార్య. తన భర్తను మానసిక వికలాంగురాలైన ఓ యువతి ఇష్ట పడడంతో ఓ భార్య తన భర్తకు దగ్గరుండి ఆ యువతితో వివాహం జరిపించింది. ఈ ఘటన తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. మహబూబాబాద్ జిల్లాకు చెందిన సురేష్, సరితలకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఓ కుమారుడు, కూతురు ఉండగా ఆమె భర్త సురేష్ ను సంధ్య అనే యువతి ఇష్టపడగా భార్య ఇద్దరికీ బంధువుల సమక్షంలో గుడిలో పెళ్లి చేసింది.