త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బిహార్లో ఎన్డీయే ఎన్నికల ప్రచార సభ నిర్వహించింది. ఈ సందర్భంగా వేదికపై ఉన్న నీతీశ్ వద్దకు చేతులు జోడిస్తూ బీజేపీకి చెందిన మహిళా అభ్యర్థి వచ్చారు. ఈ క్రమంలో సీఎం తన చేతిలో ఉన్న దండను ఆమె మెడలో మెడలో వేశారు. దీంతో ఆయన ఆరోగ్యంపై చర్చ మొదలైంది.. ఈ వీడియో వైరల్గా మారడంతో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సీఎం ఆరోగ్యంపై బులెటిన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.