భర్తను వదిలేసి బిచ్చగాడితో ఓ మహిళ వెళ్లిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్ జిల్లాలో చోటు చేసుకుంది. రాజు(45), రాజేశ్వరి(36) అనే దంపతులకు ఆరుగురు సంతానం. ఇద్దరూ అన్యోన్యంగా కలిసి ఉండేవారు. అయితే వారి ఇంటి పరిసరాల్లో నానే పండిత్ అనే బిచ్చగాడు ఉండేవాడు. అతడితో తరుచూ రాజేశ్వరి మాట్లాడేదట. ఈ క్రమంలోనే అతడితో తన భార్య వెళ్లిపోయిందని రాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో బిచ్చగాడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.