TG: మద్యం మత్తులో గూడ్స్ రైలెక్కిన యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఫలక్నుమా రైల్వే స్టేషన్లో మద్యం మత్తులో పవన్(30) అనే యువకుడు గూడ్స్ రైలు పైకెెక్కి హల్చల్ చేశాడు. పోలీసులు విద్యుత్ సరఫరా నిలిపివేసేలోపే అతడికి ఎర్తింగ్ తగిలి తీవ్ర గాయాలయ్యాయి. భూపాలపల్లికి చెందిన అతడిని చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.