బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమోదయోగ్యమైన గుర్తింపు పత్రాల జాబితా నుంచి ఆధార్ను మినహాయించాలనే అంశంపై వివాదం కొనసాగుతోంది. దీనిపై స్పందించిన UIDAI CEO భువనేశ్ కుమార్.. ఆధార్ ఎప్పుడూ మొదటి గుర్తింపు పత్రం కాదని స్పష్టం చేశారు. నకిలీ ఆధార్ కార్డుల నివారణకు క్యూఆర్ కోడ్ స్కానర్ యాప్ను వినియోగించాలని సూచించారు. కొత్త ఆధార్ యాప్ అభివృద్ధిలో దశలో ఉందని అన్నారు.