AP: నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళికి సీఎంఎం కోర్టు మార్చి 20వరకు రిమాండ్ విధించింది. తనపై అక్రమంగా కేసులు పెట్టారని పోసాని న్యాయాధికారికి చెప్పారు. ఒకే విధమైన కేసులతో అన్ని ప్రాంతాలు తిప్పుతున్నారని, తాను అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నానని చెప్పారు. అనంతరం పోలీసులు ఆయనను కర్నూలు జైలుకు తరలించనున్నారు.