నిమజ్జనంలో తల్వార్ తో దాడి... ఇద్దరు అరెస్టు

చంపాలనే ఉద్దేశంతో తల్వార్ తో దాడి చేసిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు బెల్లంపల్లి వన్ టౌన్ సిఐ దేవయ్య తెలిపారు. హనుమాన్ బస్తీకి చెందిన గణేష్ తన స్నేహితుడు శ్రీనివాస్ సహాయంతో రామ్ నగర్ కు చెందిన శ్రావణ్ ను ఈ నెల 16న గణేష్ నిమజ్జనంలో చంపేందుకు ప్రయత్నించినట్లు వెల్లడించారు. శ్రావణ్ పై తల్వార్ తో దాడికి యత్నించారన్నారు. కాగా నిందితులను శనివారం పోలీసులు అరెస్టు చేశారు.

సంబంధిత పోస్ట్