సీఎంఆర్ఎఫ్ పథకం పేదలకు వరం లాంటిదని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. భీంపూర్లోని పిప్పల కోటి గ్రామానికి చెందిన దొంతుల రుక్మ బాయికి రూ. 60 వేలు, బజార్హత్నూర్లోని దెగమకు చెందిన అడ్వాల గంగు బాయికి రూ. 54 వేల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన క్యాంప్ కార్యాలయంలో శనివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, ఆఫ్రోజ్, మహేందర్, తదితరులు పాల్గొన్నారు.