ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం బండల నాగాపూర్ గ్రామంలో పిడుగుపాటుతో ఆలయ గోపురం గురువారం ధ్వంసం అయింది. కలశం ధ్వంసం కాగా.. గోపురానికి నెర్రలు బారాయని స్థానికులు తెలిపారు. జిల్లాలో పిడుగులతో కూడిన వర్షం కురవడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.