విగ్రహం ధ్వంసం ఘటనలో నిందితుడు అదుపులో.. పుకారులు నమ్మవద్దు

భీంపూర్ మండలం పిప్పలకోటిలోని పెద్దమ్మ దేవాలయంలో విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసినట్లు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఎస్సై విక్రం దర్యాప్తు చేపట్టగా, స్థానికుల వాంగ్మూలాల ఆధారంగా చిరంజీవి అనే వ్యక్తిని గుర్తించారు. విచారణలో నిందితుడు మతిస్థిమితం లేక చికిత్స పొందుతున్నట్లు వెల్లడైంది. ప్రజలు పుకార్లను నమ్మవద్దని, సమన్వయం పాటించాలని సీఐ శ్రవణ్ సూచించారు.

సంబంధిత పోస్ట్