అనారోగ్య సమస్యలతో బాధపడుతూ జీవితంపై విరక్తి చెంది జైపూర్ మండలం టేకుమట్ల గ్రామానికి చెందిన కూలీ కొత్తపల్లి శ్రీనివాస్ (38) ఆత్మహత్యకు పాల్పడినట్టు ఎస్సై శ్రీధర్ మంగళవారం తెలిపారు. గత ఏడాది నుంచి శ్రీనివాస్ నరాల సమస్యతో బాధపడుతూ పని మానేసి చికిత్స తీసుకుంటున్నాడు. ఇంట్లో ఇనుప దూలానికి చీరతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై వెల్లడించారు.