ఖానాపూర్ పట్టణంలో నిర్వహించే జాబ్ మేళాను నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ఉట్నూర్ మండల అధ్యక్షులు పి. రేవంత్ రావు కోరారు. గురువారం ఉట్నూర్ ప్రెస్ క్లబ్ లో టీఆర్ఎస్ నాయకులతో కలిసి జాబ్ మేళా పోస్టల్ విడుదల చేశారు. జూలై 12న ఖానాపూర్ పట్టణంలోని ఏఎంకే ఫంక్షన్ హాల్ లో జాబ్ మేళా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వి అధ్యక్షులు ధరణి రాజేష్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.