లక్షేటిపేటకు మున్సిపాలిటీ పరిధిలోని గోదావరి రోడ్డుకు చెందిన తొగరి రాజేష్ (40) మద్యానికి బానిసై ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై గోపతి సురేష్ తెలిపారు. భార్య సుమలతతో గొడవ జరిగి ఇటీవలే తన ఇద్దరు పిల్లలను తీసకొని ఆమె చొప్పరపల్లిలోని పుట్టింటికి వెళ్ళింది. దీంతో మనస్థాపానికి గురై మద్యానికి బానిసయ్యాడు. మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.