మంచిర్యాల: అమ్మాయి పేరుతో చాట్.. ఆపై చిత్రహింసలు

కరీంనగర్‌ జిల్లాకు చెందిన సందీప్, ప్రణయ్, రెహాన్ ముగ్గురు యువకులు మంచిర్యాలకు చెందిన ఒక యువకుడితో అమ్మాయి పేరుతో వాట్సాప్‌లో చాట్ చేశారు. ఈ నెల 11న కరీంనగర్ వచ్చిన యువకుడిని అమ్మాయి మనుషులం అంటూ రిసీవ్ చేసుకున్నారు. అనంతరం కరీంనగర్ శివారులోని వెలిచాల గ్రామ సమీపంలోకి తీసుకెళ్లి చిత్రహింసలకు గురి చేసి, రూ. 50 వేలు డబ్బులు డిమాండ్ చేశారు. తన వద్ద ఉన్న రూ.10 వేలు ఇచ్చి, మరో రూ.12 వేలు ఫోన్ పే చేయించి, అనంతరం ఆ యువకుడు తప్పించుకుని పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగి సందీప్, ప్రణయ్‌లను శనివారం అరెస్ట్ చేసిన పోలీసులు. పరారీలో ఉన్న రెహాన్ కోసం గాలింపు.

సంబంధిత పోస్ట్