సిర్పూర్ (టీ) మండలం వెంకట్రావుపేట్ వద్ద గల పోడ్స బ్రిడ్జ్ గురువారం పెన్ గంగా నది ఉధృతంగా ప్రవహిస్తుంది. హత రెండు రోజులుగా మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు అన్ని నదులు, వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. పెన్ గంగా నది ఉదృతంగా ప్రవహిస్తుండటంతో వెంకట్రావ్ పేట్ వద్ద బ్రిడ్జ్ను దాదాపుగా ఆనుకుని ప్రమాదకర స్తితిలో వరద నీరు ప్రవహిస్తుంది. ఈ బ్రిడ్జ్ పై నుండి రాకపోకలను అధికారులు నిలిపివేశారు.