కాగజ్నగర్లో రహదారి విస్తరణ పనుల్లో భాగంగా చేపట్టిన కూల్చివేతలను ఎస్పీఎం పరిశ్రమ ప్రతినిధులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ సంఘటనతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం అధికారులు, పోలీసుల మధ్య చర్చలు కొనసాగుతుండగా, పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు చర్యలు చేపడుతున్నారు.