కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం బాలాజీ అనుకోడా గ్రామానికి చెందిన లక్ష్మి (55) గత శనివారం అడవి పంది దాడిలో గాయపడింది. చికిత్స కోసం కరీంనగర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, బుధవారం ఆమె మృతి చెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందిందని ఎస్ఐ నరేశ్ తెలిపారు.