కర్ణాటకలోని మొళకాళ్మూరు తాలుకాకు చెందిన ప్రవీణ్, పద్మజ అనే ఇద్దరు ఐదేళ్ల నుంచి ప్రేమించుకుని గత వారం గుడిలో పెళ్లి చేసుకున్నారు. కులాలు వేర్వేరని వారి పెళ్లికి పద్మజ తల్లిదండ్రులు అడ్డు చెప్పారు. ప్రేమికులిద్దరూ నిన్న రిజిస్టర్ పెళ్లి చేసుకోవాలని మొళకాళ్మూరుకు బయల్దేరారు. ఇంతలో పద్మజను వారి బంధువులు అడ్డుకుని బైక్పై తీసుకెళ్లారు. మొళకాళ్మూరు తాలుకా బీజీకెరెకి చెందిన ప్రవీణ్ ఎస్టీ కాగా, కోనసాగరకు చెందిన పద్మజ బీసీ.