TG: నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండలం సీత్యాతండాలో రమావత్ రవి (34) అనే వ్యక్తిని అతని భార్య లక్ష్మి, మేనల్లుడు గణేశ్ కలిసి హత్య చేశారు. రవికి, భార్య లక్ష్మికి 15 ఏళ్ల క్రితం పెళ్లైంది. లక్ష్మి, రవి అక్క కుమారుడు గణేశ్తో వివాహేతర సంబంధం కొనసాగించింది. ఈ విషయంపై రవి, కుటుంబసభ్యులు వారిని మందలించినా ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ క్రమంలో గొడవ తర్వాత రవి డ్యూటీకి వెళ్ళగా, లక్ష్మి తల్లి ఇంటికి వెళ్లింది. మరుసటి రోజు రాత్రి ఇంటికి వచ్చి రవితో గొడవ పడి హత్య చేసినట్లు పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది.