అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాద ఘటనపై AAIB కీలక విషయాలు వెల్లడించింది. ‘విమానం టేకాఫ్ అయ్యాక రెండు ఇంజిన్లు ఆగిపోయాయి. ఫ్యుయెల్ కంట్రోలర్ స్విచ్లు సెకన్ పాటు కటాఫ్కు మారాయి. పైలట్ ఎందుకు ఇంజిన్ స్విచ్ ఆఫ్ చేశావని మరో పైలట్ను ప్రశ్నించగా, తాను స్విచ్ ఆఫ్ చేయలేదని మరో పైలట్ సమాధానం ఇచ్చినట్లు కాక్పిట్లో రికార్డు అయ్యింది. విమానంలో ప్రమాదకరమైన వస్తువులు ఏమీ లేవు’ అని AAIB 15 పేజీల నివేదికలో స్పష్టం చేసింది.