సాగుకు ‘ఏఐ’ సాయం.. రైతుల కోసం ‘భారత్ విస్తార్’

భారతీయ వ్యవసాయ రంగంలో సాంకేతిక విప్లవానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విడివిడిగా ఉన్న వ్యవసాయ పరిశోధనలు, డేటాను ఏకీకృతం చేస్తూ కృత్రిమ మేధ (ఏఐ) ఆధారంగా రైతులకు నేరుగా సలహాలు అందించేలా ‘భారత్-విస్తార్‌’ అనే సరికొత్త డిజిటల్ వ్యవస్థను రూపొందించింది. అగ్రిస్టాక్ పోర్టల్స్, ఐకార్‌ ప్యాకేజీలను ఏఐ సిస్టమ్‌లతో అనుసంధానించడం ద్వారా సాగును మరింత లాభసాటిగా మార్చడమే దీని లక్ష్యం. ఈ వ్యవస్థ ద్వారా రైతులకు నిర్దిష్ట శాస్త్రీయ సలహాలు, కరువు, తెగుళ్ల దాడుల గురించి ముందస్తు హెచ్చరికలు అందుతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్