ఎయిర్ ఇండియా నమస్తే వరల్డ్ సేల్లో భాగంగా బేస్ ఛార్జీలపై భారీ డిస్కౌంట్ను ప్రకటించింది. ఈ సేల్ ఫిబ్రవరి 5 వరకు బుకింగ్ల కోసం అందుబాటులో ఉంటుంది. ప్రయాణ తేదీ ఫిబ్రవరి 11 నుంచి డిసెంబర్ 31 లోపు ఉండాలి. దేశీయ వన్-వే ఛార్జీలు రూ.1,499 నుండి, అంతర్జాతీయ ఛార్జీలు రూ.5,033 నుండి ప్రారంభమవుతాయి. ఇండియా-జురిచ్ రూ.46,000, ఇండియా-సిడ్నీ రూ.46,699 వంటి ఛార్జీలు అందుబాటులో ఉన్నాయి. ఎయిర్ ఇండియా వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా నేరుగా టిక్కెట్లు బుక్ చేసుకుంటే సౌలభ్య ఛార్జీలు ఉండవు. SBI, అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డులతో పాటు UPI, నెట్ బ్యాంకింగ్తో బుకింగ్లపై అదనపు డిస్కౌంట్లు కూడా ఉన్నాయి.