రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో ఆఫ్ డే స్కూల్ టైమింగ్స్లో మార్పు చేస్తూ ఏపీ విద్యాశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో ఉదయం 7.45 గం. నుంచి 12.30 గం. వరకు, పదో తరగతి పరీక్షా కేంద్రాలున్న పాఠశాలల్లో మధ్యాహ్నం 1.15 గం. నుంచి సాయంత్రం 5 గం.వరకు తరగతులు జరగనున్నాయి. తెలంగాణలో ఉదయం 8 గం. నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, పదో తరగతి పరీక్షలు జరుగుతున్న సెంటర్లలో మధ్యాహ్నం 1.00 గం. నుంచి సాయంత్రం 5 గం. వరకు తరగతులు నిర్వహించనున్నారు.