వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రాంతం ఏర్పడింది. దీంతో ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు, పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. శనివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే కామారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబ్ బాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు.