తెలంగాణలో రోజురోజుకూ ఎండ తీవ్రత పెరుగుతోంది. అన్ని జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు దాదాపు 40-44 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. అటు ఈ నెల 15-17 తేదీల మధ్య కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.