జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ (జేఎఫ్ఎస్ఎల్) అలయంజ్ గ్రూప్ల జాయింట్ వెంచర్ అయిన అలయంజ్ జియో రీఇన్సూరెన్స్ తాజాగా కార్యకలాపాలు ప్రారంభించింది. సోనియా రావల్ దీనికి చీఫ్ ఎగ్జిక్యూటివ్గా వ్యవహరిస్తారు. ఈ జాయింట్ వెంచర్ ద్వారా దేశీయ బీమా వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని సంస్థ ఎండీ హితేష్ సేథియా తెలిపారు. బీమా కంపెనీలకు వినూత్నమైన, పటిష్టమైన రిస్క్ సొల్యూషన్స్ అందించనున్నట్లు అలయంజ్ ఎస్ఈ బోర్డు సభ్యుడు క్రిస్ టౌన్సెండ్ వివరించారు.