హీరో అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఈ నెల 27 వరకు రిమాండ్కు అనుమతి ఇస్తున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది. దీంతో అల్లు అర్జున్ను చంచల్గూడ జైలుకు తరలిస్తున్నారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా.. పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ ఘటనకు, తనకు సంబంధం లేదని హైకోర్టులో అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ వేయగా.. విచారణ కొనసాగుతోంది.