సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ను అరెస్ట్ చేసిన విషయంపై హీరోయిన్ రష్మిక మందన్నా స్పందించారు. "నేను ప్రస్తుతం చూస్తున్నది నమ్మలేకపోతున్నాను. తొక్కిసలాట ఘటనలో మహిళ ప్రాణాలు కొల్పోవటం దురదృష్టకరం, తీవ్ర విషాదకరం. అయితే దీనికి సంబంధించి ఒకే వ్యక్తిపై ఆరోపణలు చేయడమనేది నిరుత్సాహరిచే విషయం. ఈ పరిస్థితి నమ్మశక్యం కానిది, హృదయ విదారకమైనది" అని పేర్కొంటూ రష్మిక ట్వీట్ చేశారు.