హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం అయిన అమర్నాథ్ యాత్ర జూన్ 29 నుంచి ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి శనివారం ఉదయం అర్చకులు తొలిపూజను నిర్వహించారు. దీంతో భక్తులు జూన్ 29 నుంచి అమర్నాథ్ని సందర్శించవచ్చు. కాగా, గతేడాది 4.5 లక్షల మందికి పైగా భక్తులు సందర్శించారు. ఈ ప్రాంతంలో తరచూ ఉగ్రదాడులు జరుగుతున్న నేపథ్యంలో భద్రతా దళాలను అధికంగా మోహరిస్తున్నారు. తీర్థయాత్ర జూన్ 29న ప్రారంభమై ఆగస్టు 19న ముగుస్తుంది.