అమర్నాథ్ యాత్రకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ నెల 3న ఈ యాత్ర ప్రారంభం కాగా..తొలి వారంలో 1.45 లక్షల మంది దర్శనం చేసుకున్నారు. వారం రోజుల్లో1.45 లక్షల మంది దర్శనం భక్తులు హిమాలయాల్లోని మంచు శివలింగాన్ని దర్శించుకున్నారు. అనంత్నాగ్ జిల్లాలోని 48 కిలోమీటర్ల పొడవైన నున్వాన్- పహల్గాం, గాందర్బాల్ జిల్లాలోని 14 కి.మీ. బాల్తాల్ మార్గాల గుండా యాత్రికులు అమర్నాథ్ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేందుకు బారులు తీరుతున్నారు.