భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య అమర్నాథ్ యాత్ర కొనసాగుతోంది. 291 వాహనాల్లో నాలుగో బృందం యాత్రకు బయల్దేరింది. హిమగిరులు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. మొదటి రోజు 32,313 మంది యాత్రికులు మంచు లింగాన్ని దర్శించుకున్నారు. ITBP డీజీ శత్రుజీత్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.