డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన చేపట్టిన ఆపరేషన్ టైగర్పై శివసేన యూబీటీ చీఫ్ ఉద్ధవ్ థాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ టైగర్ వెనక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హస్తం ఉందని, భవిష్యత్తులో మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ ప్రధానమంత్రి అభ్యర్థి అయ్యే అవకాశం ఉన్నందున అతడిని రేసు నుంచి తప్పించేందుకే అమిత్ షా ఈ ఆపరేషన్ నడిపించారని ఆరోపించారు. ఇది ఆపరేషన్ టైగర్ కాదని, ఆపరేషన్ ఫడ్నవీస్ అని అభివర్ణించారు.