బనకచర్ల, గోదావరి జలాల గురించి మాట్లాడే హక్కు ఆంధ్రా వాళ్లకు లేదని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ‘అక్రమంగా ఏపీ ప్రభుత్వం బనకచర్ల జలాలను తీసుకెళ్తుంటే చూస్తూ ఎలా ఉంటాం. కేంద్రమంత్రితో భేటీలో బనకచర్ల విషయాన్ని ఎజెండాగా చేర్చడానికే తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకోలేదు. గోదావరి ఎండిపోతే మేం ఎలా బతకాలి? మేడిగడ్డ ఎప్పుడు కూలిపోతుందో చెప్పలేమని నివేదికలు అందాయి. బనకచర్లను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము’ అని తెలిపారు.